హైదరాబాద్/తెలంగాణ:
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు గారు ప్రకటించిన కొత్త రాష్ట్ర కమిటీ జాబితాలో, సీనియర్ నాయకులు పోతుగంటి భరత్ ప్రసాద్ గారు రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
గతంలో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి, పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన నాయకుడిగా భరత్ ప్రసాద్ గారికి గుర్తింపు ఉంది. ఆయన క్రమశిక్షణతో పార్టీ విధానాలను అనుసరించడం, ప్రజలతో మమేకమై పనిచేయడం మరియు యువతలో ఉత్సాహం నింపడం వంటి లక్షణాలతో పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నారు. భరత్ ప్రసాద్ గారి నియామకం రాష్ట్ర కమిటీకి కొత్త శక్తిని అందించి, భవిష్యత్లో పార్టీని మరింత బలపరిచేందుకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తన నియామకంపై పోతుగంటి భరత్ ప్రసాద్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇవ్వడం తనకు గొప్ప గౌరవమని తెలిపారు.
"నాపై నమ్మకం ఉంచిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవకాశం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజల ఆశలు నెరవేర్చేందుకు, తెలంగాణలో బీజేపీని అధికార దిశగా తీసుకెళ్లేందుకు శక్తివంచనలేని కృషి చేస్తాను," అని భరత్ ప్రసాద్ గారు పేర్కొన్నారు.
రాష్ట్ర కమిటీలో ఈ కొత్త నియామకం తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తుందని అంచనా వేస్తున్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com