అమ్రాబాద్ (వటవర్లపల్లి): నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. రోగులకు సేవలు అందించాల్సిన సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వేచి చూడక తప్పని పరిస్థితి: దూర ప్రాంతాల నుండి, చెంచు పెంటల నుండి వచ్చే రోగులు ఉదయాన్నే ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అయితే, సిబ్బంది మాత్రం తమకు నచ్చిన సమయంలో విధులకు వస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉదయం ఓపీ (OP) సమయంలో వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు గంటల తరబడి ఆసుపత్రి బయటే వేచి ఉండాల్సి వస్తోంది. మధ్యాహ్నం వేళల్లో కూడా నిర్ణీత సమయం కంటే ముందే ఆసుపత్రికి తాళాలు వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం: సిబ్బంది తీరుపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్తులు వాపోతున్నారు. "పై అధికారులు వస్తున్నారంటేనే సిబ్బంది సక్రమంగా ఉంటున్నారు, మిగతా రోజుల్లో అంతా ఇష్టారాజ్యంగా నడుస్తోంది" అని బాధితులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి, వటవర్లపల్లి ఆసుపత్రిలో సమయపాలన పాటించేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com