నాగర్ కర్నూల్: నిరుద్యోగ యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ పథకం' మూడో దశ ప్రారంభమైంది. 2024-25 సంవత్సరానికి గాను పైలట్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
అర్హతలు మరియు ప్రయోజనాలు: ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులకు 6 నుండి 9 నెలల పాటు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తారు.
వయస్సు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
చదువు: 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమాతో పాటు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ, బీఈ/బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు. (పీజీ చేసిన వారు అనర్హులు).
స్టైపెండ్: నెలకు రూ. 9,000 చొప్పున స్టైపెండ్ అందుతుంది. ఇందులో రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద కంపెనీలు చెల్లిస్తాయి. దీనికి అదనంగా ఒకసారి రూ. 2,000 సహాయం కూడా అందుతుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి మూడు రకాల ఇంటర్న్షిప్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. దరఖాస్తు సమయంలో e-KYC తప్పనిసరి. అవసరమైన పత్రాలను 7MB లోపు JPEG లేదా PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం హెల్ప్లైన్ నంబర్ 1800116090 ని సంప్రదించవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com